Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 24 July 2022

కొండనాలిక్కి మందేస్తే-బుల్లి కథ - sarma

బుల్లి కథ కొండనాలిక్కి మందేస్తే ఒక పల్లెటూరు దామోదరానికి అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరకెళ్ళేడు. డాక్టర్ పరీక్ష చేసి మందు రాసిచ్చేడు. రాత్రి పడుకోబోయే ముందు ఈ మాత్ర వేసుకో, నిద్ర బాగా పడుతుంది,కొంచం మగతగా ఉండచ్చు, అని కూడా చెప్పేడు.  దామోదరం ఇంటికొచ్చి సంగతి చెప్పి మందు వేసుకుని పడుకున్నాడు. తెల్లారింది ఏడయింది, ఎనిమిదీ అయింది లేవడే! నాలుగు గంటలకే లేచి కాఫీ అని అరిచేవాడు, ముసలాయన,  లేవలేదేంటబ్బా! టపాగాని కట్టేసేడా? అని అనుమానపడి చూస్తే హంస తిరుగుతూ ఉంది. బలవంతాన లేపితే లేచి ముఖం కడిగిస్తే, కాఫీ తాగి మళ్ళీ పడుకున్నాడు. డాక్టర్ మత్తుగా ఉంటుందన్నారు కదా! అని పడుకోనిచ్చారు, ఇంట్లోవాళ్ళు. మధ్యాహ్నం పన్నెండు, ఒంటి గంట, ఎంతకీ లేవడే. పొద్దుటిలాగే బలవంతాన లేపి కూచోబెట్టి అన్నం పెడితే తిని మళ్ళీ పడుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కంగారొచ్చి డాక్టర్ దగ్గరికి పోయి చెబితే సాయంత్రాని కి లేస్తాడు, కంగారు పడకండంటే, తిరిగొచ్చారు. రాత్రికి లేచాడు దామోదరం. భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. తనే లేచాడుగా,డాక్టర్ చెప్పినట్టిని ఊరుకున్నారు, ఇంట్లో వాళ్ళు. పడుకున్నవాడు హటాత్తుగా సగం రాత్రి లేచి కడుపులో గుడగుడమంటోదని పరుగెట్టేడు. అది మొదలు ప్రతి గంటకి ఒక విరేచనం, అదీ నీళ్ళ విరేచనం. ఇంట్లోవాళ్ళు కంగారుపడి డాక్టర్ దగ్గరికి పోదామంటే నిశరాత్రి, అని, దగ్గరున్న మాత్రేదో వేశారు. విరేచనాలు ఝాడించి కొట్టేయి. ఇంట్లో ఉన్న ఓ.ఆర్.ఎస్ (కాచి చల్లార్చిన నీళ్ళలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపి)  కలిపిచ్చేరు, ఆరారగా. ఉదయానికి వాడిపోయిన తోటకూర కాడలాగా ఐపోయాడు, నోట్లోంచి మాట కూడా రావడం కష్టంగా ఉంది. ఇంట్లోవాళ్ళు ఈ సారి నిజంగానే కంగారు పడి, డాక్టర్ దగ్గరికి మోసుకుపోయారు, తెల్లారగానే . డాక్టర్ చూసి ఒక సూది మందు పొడిచి, రెండు సెలైన్లు ఒక దాని తరవాత మరొకటి పెడితే, కొంచం తేరుకున్నాడు. భోజనం పెట్టించి, ఇంటికి తీసుకుపొమ్మన్నారు, డాక్టర్. సార్! ఏమయిందని అడిగితే, అనారోగ్యం అని నా దగ్గరకొచ్చాడు. ఆ అనారోగ్యానికి అందరికి రాసిచ్చే మాత్రే ఇతనికీ రాశాను. దురదృష్టం, మగత సామాన్యమేగాని, ఇంతగా నిద్ర పోతాడనుకో లేదు, ఇక నీళ్ళ విరేచనాలు కూడా ఆ మందు ప్రభావమే! ఆ మందు వేసుకుంటే దాని ప్రభావం, సైడ్ ఎఫెకట్స్, నీళ్ళవిరేచనాలు,నిద్ర మత్తు, తలనొప్పి ఉంటాయి. ఎక్కువ మందిలో ఇవి కూడా ఉండవు. లక్ష మందిలో ఒకరికి ఏదో ఒకటి రావచ్చు, కాని ఈ దామోదరంగారికి రెండూ వచ్చాయి, కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టయిందని, నవ్వేరు, డాక్టర్.
Post Date: Sun, 24 Jul 2022 03:07:25 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger