కవిమిత్రులకు నమస్కృతులు. కొద్ది రోజులుగా మాటిమాటికి జ్వరం వస్తూ పోతూ ఉండడం, శారీరకంగా బలహీనంగా ఉండడం జరుగుతూ ఉన్నది. మందులు వాడుతున్నాను. దీనికి తోడుగా... 'అనంతచ్ఛందం' వారి 2200 ఛందాలతో వందమంది కవుల పదివేల పద్యాల సంకలనం పరిష్కారం, డిటిపి చేస్తున్నాను. అంతేకాక ఆ మధ్య కాశికి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తక ప్రచురణ సంస్థ వారు "కాశికి వచ్చేవారిలో తెలుగువారే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళు తెలుగులో కాశికి సంబంధిచిన పుస్తకం అడుగుతున్నారు. కనుక కాశీ ప్రాశస్త్యం, చరిత్ర, చూడవలసిన ప్రదేశాల వివరాలతో ఒక పుస్తకం వ్రాసి, డిటిపి చేసి పంపవలసిందిగా కోరినారు. ఆ పని కూడా కొనసాగుతున్నది. అందువల్ల ఏమాత్రం సమయం చిక్కడం లేదు. బ్లాగులో, సమూహంలో మిత్రుల పద్యాలపై స్పందించలేకపోతున్నాను. కనుక నన్ను మన్నించి కొద్ది రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి చేస్తున్నాను.
Post Date: Sat, 03 Sep 2022 05:23:52 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 03 Sep 2022 05:23:52 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment