మన దక్షిణ భారతం ఎన్నో రమణీయ దృశ్యాలకు పెట్టింది పేరు. దానిలో ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో ఉన్న కూర్గు ప్రాంతం తప్పక చూడదగినది. కర్ణాటక రాష్ట్రం లో ఉన్న ఈ జిల్లా బెంగుళూరు నుంచి 270 కి.మీ,మైసూర్ నుంచి 122 కి.మీ. ఉంటుంది.కూర్గు జిల్లా మొత్తం పచ్చని ప్రకృతి తో,జలపాతాలతో,కనువిందు చూసే కాఫీ తోటలతో అలరారుతూంటుంది. కూర్గు జిల్లాని మూడు తాలూకాలుగా విభజించారు. అవి మడికేరి,విరాజ్ పేట,సోమవార్ పేట. సంవత్సరం మొత్తం అంతా కూడా 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అంత చల్లగా ఉంటూ ,కాఫీ పంట ఇంకా అరుదైన సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి కాబట్టి దీన్ని బ్రిటీష్ వారు స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.ఇప్పటికీ మనవాళ్ళు అలానే పిలుస్తుంటారు. వీరి స్వీట్లు,వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.బ్రహ్మాండమైన పశ్చిమ కనుమల అందాల్ని చూడాలంటే తప్పక ఇక్కడకి రావాలిసిందే. (Kodagu people) రకరకాల వైన్స్ ని తయారుచేయడం లో ఈ ప్రాంతానికి ఓ చరిత్ర ఉన్నది.ఇక్కడ నివసించే ప్రధాన ప్రజలు కొడవ జాతికి చెందినవారు.సైనిక లేద యోధ జాతికి చెందినవారిగా పరిగణించుకుంటారు.వీరి వేషభాషలు,సంస్కృతి,ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీరి ప్రధాన దైవం కావేరి నదీమాత.ఇంకా ప్రకృతి. తుపాకుల్ని సైతం పూజిస్తారు.కేలి మూర్త వీరి పండుగ.వీరి పెళ్ళిళ్ళు గాని శుభ కార్యాలు గాని అన్నీ ఆ కొడవ జాతి పెద్దలే నిర్వహిస్తారు తప్పా బ్రాహ్మల్ని పిలిచి చేయించడం ఉండదు. నిజానికి వీరిలో కులాలు,ఉపకులాలు ఏమీ ఉండవు. అందుకనే వీరు హిందువుల్లో ఉన్నా లేనట్లు గానే కొంతమంది పరిగణిస్తారు.
Post Date: Sun, 23 Apr 2023 19:23:56 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sun, 23 Apr 2023 19:23:56 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment