( వృకాసురుండు మడియుట ) 10.2-1257-ఆ. అశుచి యగుచు నతని నంటఁగఁ బని గాదు కాలుఁ జేయిఁ గడిగి కడఁక వార్చి యతనివెంట వేడ్క నరుగుదువే నీవు నవల నంటఁ దగును నసురనాథ! 10.2-1258-మ. అతి దుశ్శంకలు మాని పొ"మ్మనిన దైత్యారాతి మాయా విమో హితుఁడై విస్మృతి నొంది తామసముచే నేపారి వాఁ డాత్మ పా ణితలంబుం దన నెత్తి మోపికొని తా నేలన్ వెసం గూలె వి శ్రుతదంభోళిహతిన్ వడింబడు మహా క్షోణీధరంబో యనన్. భావము: అదీగాక దైత్యేంద్రా! నీవు అశుచిగా ఉండి మహేశుడిని తాకడం తగదు. అందుచేత, వెళ్ళి కాళ్ళుచేతులూ కడుగుకుని, ఆచమనం చెయ్యి. అప్పుడు శివుడిని వెంబడించి అతడిని తాకావచ్చు, నీ సందేహం తీర్చుకోనూవచ్చు. అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు. వెంటనే బయలుదేరు." అంటూ దానవాంతకుడు అయిన విష్ణువు హెచ్చరించాడు. వృకాసురుడు విష్ణుమాయ వలన తనను తాను మరచి, తామసంతో తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుని మరణించాడు. వృకాసురుడు ప్రసిద్ధమైన వజ్రాయుధం దెబ్బకు కూలిన మహా పర్వతంలా నేలకూలాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1258 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Mon, 15 Aug 2022 14:28:57 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 15 Aug 2022 14:28:57 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment