( భృగుమహర్షి శోధనంబు ) 10.2-1279-సీ. మునినాయకులతోడఁ దన పోయి వచ్చిన- తెఱఁగును దనమది దృష్టమైన మూఁడుమూర్తుల విధంబును నెఱింగించిన- విని వారు మనముల విస్మయంబు నంది చిత్తంబున సందేహమునుఁ బాసి- చిన్మయాకారుండు, శ్రీసతీశుఁ, డనుపముఁ, డనవద్యుఁ, డఖిల కల్యాణగు- ణాకరుఁ, డాదిమధ్యాంతరహితుఁ, 10.2-1279.1-తే. డై తనర్చిన పుండరీకాక్షుఁ డొకఁడ కాక గణుతింప దైవ మొక్కరుఁడు వేఱ కలఁడె యనుబుద్ధి విజ్ఞాన కలితు లగుచు హరిపదాబ్జాతయుగళంబు నర్థిఁ గొలిచి. 10.2-1280-వ. అట్లు సేవించి యవ్యయానందంబయిన వైకుంఠధామంబు నొంది; రని చెప్పి వెండియు నిట్లనియె. భావము: ఆ ఋషీశ్వరులకు తను వెళ్ళివచ్చిన వివరాలు, తనకు అవగతము అయిన త్రిమూర్తుల స్వభావాలు భృగుమహర్షి సవిస్తరంగా తెలిపాడు. ఆ మునీంద్రులు అచ్చెరు వొందారు. వారు సందేహాలు విడిచిపెట్టారు. సకల కల్యాణనిధి, చిన్మయస్వరూపుడు, లక్ష్మీపతి, అనుపమ అనవద్యుడు, ఆదిమధ్యాంత రహితుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీమహావిష్ణువు ఒక్కడే పరమదైవం అని నిర్ణయించారు. అలా ఆ మునులు మహాఙ్ఞానులు అయి, హరిపాదారవింద ధ్యానరతులు అయి, ప్రీతితో సేవించారు. అలా విష్ణుమూర్తిని భక్తితో సేవించిన ఆ మునులు వైకుంఠప్రాప్తిని పొందారు." అని చెప్పి శుకమహర్షి పరీక్షుత్తుతో ఇంకా ఇలా అన్నాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1279 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Mon, 29 Aug 2022 13:40:45 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 29 Aug 2022 13:40:45 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment