( విప్రుని ఘనశోకంబు ) 10.2-1283-వ. ఇవ్విధంబున మఱియు దన సుతులు మృతులయినపు డెల్ల వారలం గొనివచ్చి యవ్విప్రుండు రాజుమొగసాలంబెట్టి రోదనంబు సేయుచు నెప్పటియట్ల కొన్నిగాథలు సదివిపోవుచుండె; నివ్విధంబున నెనమండ్రు సుతులు మృతులైనపిదపం దొమ్మిదవ సుతుండును మృతుండైన వాని నెత్తికొని వచ్చి యెప్పటి విధంబునఁ బలవరించుచున్న యా బ్రాహ్మణునిం గని యర్జునుం డిట్లనియె. భావము: ఈ విధంగా తనకు కొడుకులు పుట్టి మరణించిన ఎనమండుగురు కొడుకులను ప్రతిసారి, వారిని తీసుకు వచ్చి రాజమందిర ద్వారం ముందు పెట్టి, ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ మునుపటిలాగే కొన్ని కథలు చదివి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా అతనికి పుట్టి చనిపోయిన తొమ్మిదవకొడుకును కూడ ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆక్రందిస్తున్న బ్రాహ్మణుడిని చూసిన అర్జునుడు ఇలా అన్నాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1283 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 02 Sep 2022 13:08:42 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 02 Sep 2022 13:08:42 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment