( విప్రుని ఘనశోకంబు ) 10.2-1292-చ. లలిత విశిష్ట సంచిత జలంబుల నాచమనంబు సేసి, సు స్థలమున నిల్చి రుద్రునకు సమ్మతి మ్రొక్కి మహాస్త్రవేది ని ర్మల శుభమంత్ర దేవతల మానసమందుఁ దలంచి గాండివం బలవడ నెక్కు ద్రోచి బిగియం గదియించి నిషంగయుగ్మమున్. 10.2-1293-వ. ఇవ్విధంబునఁ గట్టాయితంబై యప్పుడు. భావము: విశిష్టమైన పవిత్రజలాలతో ఆచమనం చేసాడు. పరిశుద్ధ ప్రదేశంలో నిలబడి శివుడికి నమస్కరించాడు. గొప్పగొప్ప అస్త్రాలను వేయగలిగిన అర్జునుడు శుభప్రదులైన మంత్రదేవతలను మనసున తలచుకుని గాండీవాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు. అమ్ముల పొదులు రెంటినీ కట్టుకున్నాడు. ఈ విధంగా సంసిద్ధుడు అయిన అర్జునుడు అంతట.... http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1292 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 08 Sep 2022 16:39:30 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Thu, 08 Sep 2022 16:39:30 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment