( విప్రుని ఘనశోకంబు ) 10.2-1294-సీ. భూసురు వెంట నిమ్ముల నేగి సూతికా- భవనంబు చుట్టును బాణవితతి నరికట్టి దిక్కులు నాకాశపథము ధ- రాతలం బెల్ల నీరంధ్రముగను శరపంజరముఁ గట్టి శౌర్యంబు దీపింపఁ- గడు నప్రమత్తుఁ డై కాచియున్న యెడ న మ్మహీసురు నింతికిఁ బుత్త్రుండు- జనియించె; నప్పు డచ్చటి జనంబు 10.2-1294.1-తే. పోయెఁ బోయెఁ గదే యని బొబ్బ లిడఁగ బొంది తోడన యాకాశమునకు మాయఁ జెందె నప్పుడు; దుఃఖంబు నొంది, భూమి సురుఁడు విలపించుచును మురహరుని కడకు. భావము: బ్రాహ్మణుడి కూడా వెళ్ళి ఆ ప్రసవమందిరం చుట్టూ దట్టమైన బాణాలతో కప్పివేశాడు. మిక్కిలి జాగరూకతతో ప్రసూతిగృహానికి కావలి కాస్తున్నాడు. అప్పుడా బ్రాహ్మణుని భార్యకు మగ పిల్లాడు పుట్టి వెంటనే చనిపోయాడు. అక్కడి జనం ఆర్తనాదాలు చేశారు. మరణించిన పిల్లాడు శరీరంతోసహా ఆకాశంలోనికి అదృశ్యం అయ్యాడు. బ్రాహ్మణుడు విలపిస్తూ మురాసురుడు కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1294 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 09 Sep 2022 17:02:18 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 09 Sep 2022 17:02:18 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment