( నారాయణఋషి భాషణ ) 11-66-చ. మదనుని బాణజాలముల మగ్నతఁ బొందక ధైర్యవంతుఁ డై, ముదితల వాఁడిచూపులకు మోహము నొందక నిశ్చలాత్ముఁడై, హృదయమునందు నచ్యుతు రమేశు ననంతు జగన్నివాసునిన్ వదలక భక్తి నిల్పుకొని వారికి నిట్లనె మౌని పెంపునన్, 11-67-క. "జంభారిపంపునను మీ రంభోరుహవదనలార! యరుదెంచితి; రా శుంభద్విహారవాంఛా రంభంబునఁ దిరుగుఁ" డనిన లజ్జించి వెసన్. భావము: ఆ సమయంలో నారాయణఋషి మన్మథుని బాణాలకు లొంగ లేదు. ధైర్యము విడువలేదు. ఆ కాంతల వాడి చూపులకు మోహము పొంద లేదు. ఏమాత్రం చలించక తన హృదయంలో అచ్యుతుడు, అనంతుడు, జగన్నివాసుడు, రమేశుడు అయిన శ్రీహరిని నిశ్చలభక్తితో మనసున నిలుపుకుని ఉన్నాడు. ఆయన వారితో ఇలా అన్నాడు. "పద్మముఖులార! ఇంద్రుడు పంపగా మీరు వచ్చారు. ఇక్కడ విహరించాలనే కోరిక ఉంటే మీ ఇష్టంవచ్చినట్లు తిరగండి." అనేటప్పటికి వాళ్ళంతా సిగ్గుపడి ఆ మహర్షితో ఇలా అన్నారు.. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=67 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : .
Post Date: Sat, 19 Nov 2022 16:02:28 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 19 Nov 2022 16:02:28 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment