( కృష్ణ సందర్శనంబు ) 11-21-క. యదుడింభకులను గనుఁగొని మదయుతులై వచ్చి రనుచు మదిలో రోషం బొదవఁ గనుఁగొనల నిప్పులు సెదరఁగ హాస్యంబు సనునె చేయఁగ ననుచున్. 11-22-క. "వాలాయము యదుకుల ని ర్మూలకరం బైన యట్టి ముసలం బొక టీ బాలిక కుదయించును బొం డాలస్యము లే ద"టంచు నటఁబల్కుటయున్. భావము: యాదవబాలురను చూసి ఆ మునుల మనసులలో వీళ్ళు మదంతో మైమరచి వచ్చారని రోషం ఉదయించింది. కనులగొలకుల నిప్పులు చెదరగా "ఇలా హాస్యాలు చేయొచ్చా?" అని అంటూ "యదువంశాన్ని నాశనం చేసే రోకలి (ముసలం) ఒకటి ఈ బాలికకు తప్పక పుడుతుంది ఆలస్యం కాదు. ఇక పొండి." అని పలికారు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=22 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Mon, 17 Oct 2022 16:22:44 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 17 Oct 2022 16:22:44 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment