( విప్రుని ఘనశోకంబు ) 10.2-1299-క. అని తను నోడక నిందిం చిన విని యయ్యర్జునుండు చిడిముడిపడుచుం దన విద్యమహిమ పెంపునఁ జనియెన్ వెస దండపాణి సదనంబునకున్. 10.2-1300-క. చని యందు ధారుణీసుర తనయులు లేకుంటఁ దెలిసి తడయక యింద్రా గ్ని నిరృతి వరుణ సమీరణ ధనదేశానాలయములు దగఁ బరికించెన్. 10.2-1301-వ. వెండియు. భావము: ఈలాగున బ్రాహ్మణుడు తనను నిందిస్తుంటే, కోపిం వచ్చిన అర్జునుడు తన విద్యాప్రభావంతో వెంటనే బయలుదేరి యమమందిరానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణపుత్రులు లేకపోడంతో పార్థుడు వెంటనే ఇంద్ర, అగ్ని, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుల నివాసాలకు వెళ్ళి అన్వేషించాడు. అనంతరం. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1300 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 16 Sep 2022 16:35:13 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 16 Sep 2022 16:35:13 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment