( వాసుదేవ ప్రశ్నంబు ) 11-31-క. "నను నీవు సేయు ప్రశ్నము జనసన్నుత! వేదశాస్త్రసారాంశంబై ఘనమగు హరిగుణకథనము విను" మని, వినిపింపఁ దొడఁగె వేడ్క దలిర్పన్. 11-32-క. "అతిపాపకర్ములైనను సతతము నారాయణాఖ్యశబ్దము మదిలో వితతంబుగఁ బఠియించిన చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే? భావము: "సచ్చరిత్ర! నీవు వేసిన ప్రశ్న వేదశాస్త్రముల సారాంశమైనది. ఘనమైన ఆ శ్రీహరి గుణకథనాలను వినవలసింది." అని వేడుక చిగురించగా వినిపించడం మొదలు పెట్టాడు. ఎంతటి పాపంచేసిన వారైనా సరే నారాయణుని నామాన్ని విడువక నిత్యం మనస్సులో స్మరించేవాళ్ళు పరమ ధన్యులు. అట్టి వారిని పొగడుట బ్రహ్మదేవుడికి సైతం సాధ్యం కాదు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=32 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Tue, 25 Oct 2022 15:38:02 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Tue, 25 Oct 2022 15:38:02 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment