( విదేహ హర్షభ సంభాషణ ) 11-33-వ. అట్లు గావున పరమేశ్వరభక్తిజనకంబై కైవల్యపదప్రాప్తికరంబయి యొప్పుచున్న విదేహర్షభసంవాదంబు నాఁ బరగు నొక్క పురాతన పుణ్యకథావిశేషం బెఱింగించెద సావధాన మనస్కుండవై యాకర్ణింపు" మని యిట్లనియె 11-34-తే. "వినుము; స్వాయంభువుండను మనువునకును రమణ నుదయించె నఁట ప్రియవ్రతుఁ డనంగఁ దనయు; డాతని కాగ్నీధ్రుఁ డనఁగ సుతుఁడు జాతుఁ డయ్యెను భువనవిఖ్యాతుఁ డగుచు. భావము: అందుకని పరమేశ్వరుని మీద భక్తిని కలిగించేది మోక్షాన్ని అందించేది అయిన విదేహఋషభ సంవాదము అనే ప్రసిద్ధమైన ఒక పురాతన పుణ్యకథను చెప్తాను ఏకాగ్ర చిత్తంతో విను." అని ఇలా చెప్పసాగాడు. "శ్రద్ధగా విను. స్వాయంభువుడనే మనువుకు ప్రియవ్రతుడనే కుమారుడు ఉదయించాడు. అతనికి అగ్నీధ్రుడనే కొడుకు పుట్టి, లోకప్రసిద్ధుడు అయ్యాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=34 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 27 Oct 2022 15:47:38 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Thu, 27 Oct 2022 15:47:38 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment