( విదేహ హర్షభ సంభాషణ ) 11-38-తే. అర్ఘ్యపాద్యాదివిధులను నర్థితోడఁ బూజ గావించి, వారలఁ బొలుపు మిగుల నుచితపీఠంబులందును నునిచి, యెలమి నవమునిశ్రేష్ఠులను భూమినాయకుండు. 11-39-క. వారల కిట్లను "మీరలు గారవమున విష్ణుమూర్తిఁ గైకొనిన మహా భూరితపోధనవర్యులు సారవిహీనంబు లైన సంసారములన్. 11-40-క. ఏ రీతి గడప నేర్తురు? క్రూరులు బహుదుఃఖరోగకుత్సిత బుద్ధుల్ నీరసులు నరులు గావున నారయ సుజ్ఞానబుద్ధి నానతి యీరే? భావము: అర్ఘ్యం పాద్యం మొదలైన శాస్త్రవిధులతో ప్ఱ్ఱార్థనా పూర్వకంగా పూజించి ఆ విదేహ మహారాజు ఆ తొమ్మిది మంది మునివరులను సముచిత పీఠాలపై కూర్చుండ బెట్టాడు. అలా ఆసీనులైనవారితో విదేహరాజు ఇలా అన్నాడు. "మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో భజించే గొప్ప తపోనిధులు. ఈ సంసారాలు పరమ సారం లేనివి. క్రూరులు; అనేక రకాల దుఃఖాలు, రోగాలు, అల్ప బుద్ధులు కలవారు; నీరసులు అయిన మానవులకు ఈ సారహీనమైన సంసారాలను దాటటానికి ఏదైనా మార్గం ఏదో సుఙ్ఞాన పూరకమైన మీ బుద్ధి కుశలతతో చెప్పండి. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=40 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Mon, 31 Oct 2022 14:46:28 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 31 Oct 2022 14:46:28 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment