( విదేహ హర్షభ సంభాషణ ) 11-36-క. జగదేకనాథు గుణములు మిగులఁగ సంస్మరణతోడ మీఱిన భక్తిం బగలును రాత్రియు సంధ్యలుఁ దగిలి జితేంద్రియులు నైన తపసులు ధాత్రిన్. 11-37-క. ఊహింపఁ బుణ్యుఁ డైన వి దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో గేహము వెడలి యెదుర్కొని మోహవివర్జితులఁ బుణ్యమునిసంఘములన్. భావము: ఆ కవి మున్నగు ఆ తొమ్మండుగురు తపస్వులు సకల లోకాలకు ప్రభువైన శ్రీహరి గుణగణాలను మిక్కిలి తలచుకుంటూ, అతిశయించిన భక్తితో పగలు రాత్రీ ఉభయ సంధ్యలు అని లేకుండా సకల వేళలా సర్వదా ఆ భగవంతుని యందే ఆసక్తి కలవారై జితేంద్రియులైన వారు. భూలోకంలో పుణ్యాత్ముడైన విదేహుడు చేస్తున్న యజ్ఞం ముగింపుకు వచ్చిన సమయానకి అక్కడకి ఆ మహా తాపసులు విచ్చేశారు. విదేహరాజు గృహం లోపలి నుంచి వచ్చి మోహవిసర్జించిన ఆ పుణ్య మునీశ్వరులకు ఎదురువెళ్ళి.... http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=6&Padyam=37 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Sun, 30 Oct 2022 15:34:14 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sun, 30 Oct 2022 15:34:14 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment