( ప్రబుద్ధుని సంభాషణ ) 11-55-క. "హరిదాసుల మిత్రత్వము మురరిపుకథ లెన్నికొనుచు మోదముతోడన్ భరితాశ్రుపులకితుండై పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!" 11-56-వ. అనిన రాజేంద్రుండు వారల కిట్లనియె; "భాగవతులారా! సకలలోకనాయకుం డగు నారాయణుం డనంబరఁగిన పరమాత్ముని ప్రభావంబు వినవలతు; నానతిం" డనినఁ బిప్పలాయనుం డిట్లనియె. భావము: మహారాజ! హరిభక్తులతో స్నేహంచేస్తూ హరిలీలలను తలచుకుంటూ కన్నులలో ఆనందబాష్పాలు నిండగా ఒళ్ళు పులకరిస్తుండగా మానవుడు హరిమాయను గెలుస్తాడు." అనగా ఆ విదేహచక్రవర్తి వాళ్ళతోఇలాఅన్నాడు. "భాగవతులారా! సమస్త లోకాలకూ ప్రభువై నారాయణుడనే నామంతో అలరారే పరమాత్ముని ప్రభావాన్ని వినాలనుకుంటున్నాను ఆనతీయండి." అంటే పిప్పలాయను డనే మునీంద్రుడు ఇలా అన్నాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=10&Padyam=56 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 11 Nov 2022 15:00:02 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 11 Nov 2022 15:00:02 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment